Breaking News Telugu Latest

News5am, Breaking News Telugu Latest (10-06-2025): తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆత్మీయ పండుగలలో ఒకటైన బోనాల పండుగను రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ఘనంగా నిర్వహించేందుకు భారీ ఏర్పాట్లు చేస్తోంది. ఈ ఏడాది తొలి బోనం జూన్ 26న చారిత్రాత్మక గోల్కొండ కోటలో ప్రారంభం కానుంది. తర్వాత వరుసగా బల్కంపేట ఎల్లమ్మ, ఉజ్జయిని మహంకాళి, లాల్ దర్వాజ బోనాలు జరుగనున్నాయి. ప్రభుత్వం ఈ పండుగను రాష్ట్ర గౌరవానికి ప్రతీకగా మార్చేందుకు రూ. 20 కోట్లు కేటాయించింది. దేవాలయాల అభివృద్ధికి ఇవ్వబోయే చెక్కులను రెవెన్యూ మరియు ఎండోమెంట్స్ శాఖలు సమన్వయంతో పూర్తి చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. రంగం, తొట్టెల ఊరేగింపులు, నగరంలోని ప్రసిద్ధ ఆలయాల్లో జరిగే ఉత్సవాలు ఈసారి విశేషంగా ఆకర్షించనున్నాయి.

బోనాల పండుగను ఎటువంటి అడ్డంకులు లేకుండా విజయవంతంగా నిర్వహించేందుకు జీహెచ్ఎంసీ, శానిటేషన్, రెవెన్యూ, లైటింగ్, వాటర్ ఫెసిలిటీ, కంట్రోల్ రూమ్ తదితర శాఖల మధ్య సమన్వయం అవసరమని మంత్రి చెప్పారు. పోలీస్ శాఖ లా అండ్ ఆర్డర్ పరంగా అప్రమత్తంగా ఉండాలని, ప్రతి శాఖ భక్తి భావంతో సేవా దృక్పథంతో తమ పని చేయాలని ఆయన సూచించారు. ముఖ్యంగా ఉజ్జయిని మహంకాళి, లాల్ దర్వాజ, బల్కంపేట ఎల్లమ్మ ఉత్సవాల కోసం ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేయాలన్నారు. అమ్మవారి ఆశీర్వాదంతో బోనాల పండుగ విజయవంతమైతే, ఇది హైదరాబాద్‌కు అంతర్జాతీయ గుర్తింపు తెస్తుందని మంత్రి విశ్వాసం వ్యక్తం చేశారు.

More Breaking News Telugu:

Breaking News Latest:

నేడు ఖర్గేతో భేటీకానున్న సీఎం రేవంత్‌..

హైదరాబాద్-సికింద్రాబాద్​ బోనాల పండుగ..

More Breaking News Telugu Latest: External Sources

బోనాలకు వేళాయే.. జూన్ 26న తొలి బోనం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *