ఆఫ్ఘనిస్థాన్ క్రికెట్ జట్టు సంచ‌ల‌నం సృష్టించింది. తమ అద్భుతమైన ప్రదర్శనతో బ‌ల‌మైన సౌతాఫ్రికాను ఓడించి వ‌న్డే సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఐకానిక్ షార్జా వేదికగా స్టేడియంలో జ‌రిగిన రెండో వ‌న్డేలో సౌతాఫ్రికాపై 177 ప‌రుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. మరో వన్డే మ్యాచ్ మిగిలి ఉండగానే తొలిసారి ఆ జట్టుపై 2-0తో సిరీస్ గెలిచి విజేత‌గా నిలిచింది.

టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్థాన్ 50 ఓవ‌ర్ల‌లో 4 వికెట్లు కోల్పోయి 311 ప‌రుగుల భారీ లక్షాన్ని చేసింది. ఆఫ్ఘన్ బ్యాట‌ర్ల‌లో రహ్మానుల్లా గుర్బాజ్ (105) పరుగులు చేసి సెంచరీతో ఆకట్టుకోగా, అజ్మతుల్లా ఒమర్జాయ్ 86, ర‌హ్మ‌త్ 50 అద్భుతమైన ప్రదర్శనతో అఫ్గానిస్థాన్‌ భారీ స్కోర్ సాధించింది. అనంతరం 312 పరుగుల భారీ లక్ష్యంతో ఛేదనకు దిగిన సౌతాఫ్రికా జట్టు వరుసగా వికెట్లు కోల్పోయింది. చివ‌రికి 34.2 ఓవ‌ర్ల‌లో 134 ప‌రుగుల‌కే ఆలౌట్ అయ్యింది. సౌతాఫ్రికా బ్యాట‌ర్ల‌లో బ‌వుమా 38, జోర్జి 31, మార్‌క్ర‌మ్ 21, హెండ్రిక్స్ 17 మిన‌హా అంద‌రూ సింగిల్ డిజిట్‌కే అవుట్ అయ్యి పెవిలియన్ కి చేరుకున్నారు. ఆఫ్ఘన్ బౌల‌ర్ల‌లో ర‌షీద్ ఖాన్ 5 వికెట్లు తీసి జ‌ట్టు విజ‌యంలో కీల‌క పాత్ర పోషించాడు. ఈ మ్యాచులో అద్భుత ప్రదర్శన చేసిన రషీద్ ఖాన్(5 వికెట్లు)కు ‘మ్యాన్ అఫ్ ది మ్యాచ్’ అవార్డు కైవసం చేసుకున్నాడు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *