ఈరోజు పెద్దపల్లి జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. నిరుద్యోగుల గెలుపుపై భారీ బహిరంగ సభలో సీఎం పాల్గొని ప్రసంగించనున్నారు. సాయంత్రం 4 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో పెద్దపల్లికి వెళ్లనున్నారు. సభ అనంతరం తిరిగి పెదపడల్లి నుంచి హైదరాబాద్కు చేరుకుంటారు. సీఎం అయిన తర్వాత రేవంత్ రెడ్డి తొలిసారిగా పెదపడల్లికి వస్తున్నారు. ఆయనకు స్వాగతం పలికేందుకు కాంగ్రెస్ నాయకులు, శ్రేణులు తగిన ఏర్పాట్లు చేశారు. అలాగే మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబులు కూడా దీనిని విజయవంతం చేసేందుకు ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు.
ఇక సీఎం రేవంత్ భారీ బహిరంగ సభకు ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుండి ప్రజలు, కాంగ్రెస్ అభిమానులు భారీగా తరలిరానున్నారు. అధికారులు పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేపట్టారు. బహిరంగ సభ భద్రత కోసం రెండు వేల మంది పోలీసు సిబ్బందిని రామగుండం సీపీ ఏర్పాటు చేశారు. ఉపాధ్యాయ ఖాళీల వివరాలను సేకరించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించినట్లు తెలిసింది. ఇప్పటికే 54 వేల ఉద్యోగాలు భర్తీ చేయగా, 2025 డిసెంబర్ నాటికి మరో 16 వేల ఉద్యోగాలు భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది.ఎస్సీ వర్గీకరణ పూర్తయిన తర్వాత కొత్త నోటిఫికేషన్లు విడుదల చేయనున్నట్టు సమాచారం.