ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీకి వెళ్లనున్నారు. ఈరోజు మధ్యాహ్నం ఒంటి గంటవరకు అసెంబ్లీ హాజరై అనంతరం గన్నవరం విమానాశ్రయానికి చంద్రబాబు చేరుకుంటారు. అక్కడి నుండి ప్రత్యేక విమానంలో ఆయన ఢిల్లీకి వెళ్లనున్నారు. సాయంత్రం 3.45 గంటలకు ఢిల్లీకి చేరుకుంటారు.
ఢిల్లీ పర్యటనలో భాగంగా పలువురు కేంద్ర మంత్రులతో చంద్రబాబు సమావేశం కానున్నారు . రాష్ట్రాభివృద్ధికి సంబంధించి పలు కీలక విషయాలపై ఆయన వారితో చర్చించనున్నారు. అదేవిధంగా, బీజేపీ పెద్దల కోరిక మేరకు శనివారం ఢిల్లీ నుంచి నేరుగా మహారాష్ట్రకు వెళ్లనున్నారు. మహారాష్ట్ర అసెంబ్లీకి జరగనున్న ఎన్నికల ప్రచారంలో సీఎం చంద్రబాబు పాల్గొననున్నారు.