ఇటీవల తెలంగాణ అసెంబ్లీ చర్చలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేక్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. వివేక్ వ్యాఖ్యలను సీరియస్గా తీసుకోవాలని రవాణా, పౌరసరఫరాల శాఖ మంత్రి శ్రీధర్బాబు అన్నారు. వివేక్ తొలిసారి ఎమ్మెల్యే కాదని, 2014లో అసెంబ్లీకి వచ్చి ఇప్పటికీ ఆధారాలు లేకుండా ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని వివేక్కు సూచించారు. లేకుంటే 2014లో బీఆర్ఎస్ ప్రభుత్వం అసెంబ్లీలో ఇతర దుస్తులు ధరించరాదని నిబంధన పెట్టిందని గుర్తు చేశారు. నిన్న నల్ల దుస్తులు వేసుకొస్తే, అయ్యప్ప భక్తి అనుకున్నాం. కానీ ఈరోజు ఆటోడ్రైవర్ దుస్తులు వేసుకొచ్చారని తెలిపారు.
మంత్రి శ్రీధర్ బాబు ఈ విషయాన్నీ తప్పుబడుతూ, అధికారంలో ఉన్నప్పుడు ఒక విధంగా, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరో విధంగా వ్యవహరిస్తున్నారంటే అది బీఆర్ఎస్ వ్యవహారం అని మండిపడ్డారు. ఈ క్రమంలో, బీఆర్ఎస్ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసిందని ఆయన విమర్శించారు. అయితే, వివేక్ చేసిన వ్యాఖ్యలను 320 రూల్ ప్రకారం తొలగించినట్లు స్పీకర్ ప్రకటించారు. కానీ, వివేక్ తన వ్యాఖ్యలను మరొకసారి పునరుద్ఘాటిస్తూ, 10 శాతం లంచం తీసుకుంటున్నారని ఆరోపించారు. దీనిపై స్పీకర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.