సీఎం హోదాలో రేవంత్ రెడ్డి తొలిసారిగా వేములవాడకు రానున్నారు. ఈ సందర్భంగా సీఎం రాజన్న సిరిసిల్ల జిల్లాపై వరాల జల్లు కురిపించారు. ప్రభుత్వ పాలనలో తొలి ఏడాది మొత్తం 694.50 కోట్లతో వివిధ అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. రూ.76 కోట్లతో ధర్మగుండంలో చేపట్టనున్న శ్రీరాజరాజేశ్వర స్వామి ఆలయ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. రూ.35.25 కోట్లతో నిర్మించనున్న అన్నదానం సత్రం పనులు, రూ. 45 కోట్లతో మూల వాగు వంతెన నుంచి దేవస్థానం వరకు రోడ్డు విస్తరణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. రూ.166 కోట్లతో చేపట్టనున్న మెడికల్ కళాశాల, హాస్టల్ బ్లాకుల నిర్మాణ పనులకు భూమిపూజ చేశారు. రూ.50 కోట్లతో నూలు డిపో నిర్మాణ పనులు ప్రారంభించనున్నారు.

రూ. 52 కోట్లతో కొనరావుపేట మండలంలో చేపట్టే హై లెవెల్ బ్రిడ్జి పనులు, రూ. 3 కోట్లతో నిర్మించే డ్రైన్ పనులకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేస్తారు. రూ.235 కోట్లతో 4696 మిడ్ మానేరు రిజర్వాయర్ నిర్వాసితులకు నిర్మించే ఇందిరమ్మ ఇండ్ల పనులకు భూమి పూజ చేపడతారు. మేడిపల్లి మండలంలో జూనియర్ కళాశాల రుద్రంగి మండల కేంద్రంలో అడ్వాన్స్ టెక్నాలజీ కేంద్రానికి సీఎం రేవంత్ శంకుస్థాపన చేస్తారు. సిరిసిల్లలో రూ. 26 కోట్లతో నిర్మించిన ఎస్పీ కార్యాలయ భవనం, వేములవాడలో రూ. కోటి 45 లక్షలతో నిర్మించిన జిల్లా గ్రంథాలయ భవనం, రూ. 4 కోట్ల 80 లక్షలతో నిర్మించిన వర్కింగ్ ఉమెన్ హాస్టల్ భవనం ప్రారంభించనున్నారు. గల్ఫ్ దేశాలలో మరణించిన 17 కుటుంబాలకు 85 లక్షల పరిహారం అందజేస్తారు. 631 శివశక్తి మహిళా సంఘాలకు 102 కోట్ల బ్యాంకు లింకేజీ రుణాల చెక్కు పంపిణీ చేస్తారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *