ప్రధాని మోదీతో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ భేటి ముగిసింది. పార్లమెంట్ లోని ప్రధాని కార్యాలయంలో వీరి సమావేశం దాదాపు అరగంట సేపు కొనసాగింది. ఏపీకి సంబంధించిన పలు కీలక అంశాలపై ప్రధానితో పవన్ చర్చించినట్టు సమావేశం.

డిప్యూటీ సీఎంగా బాధ్యతలను స్వీకరించిన తర్వాత తొలిసారి మోదీని పవన్ కలవడంతో ఈ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. మోదీతో సమావేశం ముగిసిన తర్వాత… పవన్ తో బీజేపీ ఏపీ అధ్యక్షురాలు, ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి భేటీ అయ్యారు. అనంతరం పవన్ ను టీడీపీ ఎంపీలు లావు శ్రీకృష్ణదేవరాయలు, మాగుంట శ్రీనివాసులు రెడ్డి కలిశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *