కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. యువగళం పాదయాత్రలో తాను, ఎన్నికల సమయంలో కూటమి పార్టీలు ఇచ్చిన ప్రతి హామీకీ కట్టుబడి ఉన్నామని విద్యాశాఖ మంత్రి లోకేశ్‌ స్పష్టం చేశారు. మారుమూల ప్రాంతాల్లో ఎటువంటి ఆదాయం లేని ఆలయాల్లో ధూప, దీప నైవేద్యాలకు ఇబ్బందిగా ఉందని బ్రాహ్మణులు పాదయాత్ర సందర్భంగా తన దృష్టికి తెచ్చారని, వారికి ఆనాడు ఇచ్చిన మాట ప్రకారం ధూప, దీప నైవేద్య సాయం తాజాగా రూ.10 వేలకు పెంచడం జరిగిందని మంత్రి గుర్తు చేశారు. దాంతో రాష్ట్రంలోని 5,400 చిన్న ఆలయాల్లో ఎటువంటి ఆటంకం లేకుండా భగవంతుడి సేవకు ఆస్కారం ఏర్ప‌డింద‌ని తెలిపారు. అందరి క్షేమం కోరే మనసున్న మంచి ప్రభుత్వం త‌మ‌ద‌ని మంత్రి లోకేశ్ స్పష్టం చేశారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *