News5am, Latest News Telugu Breaking (10-06-2025): కొత్తగా ప్రమాణ స్వీకారం చేసిన మంత్రులకు శాఖలు కేటాయించే విషయంలో ప్రభుత్వం ఆలస్యం చేస్తోంది. అయితే, సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ హైకమాండ్ సూచనలతో శాఖల కేటాయింపుపై స్పష్టత కోసం ఢిల్లీకి వెళ్లినట్టు సమాచారం. అక్కడ ఆయన కేసీ వేణుగోపాల్, మల్లికార్జున ఖర్గేలతో సమావేశమై మంత్రుల శాఖల గురించి చర్చించినట్టు తెలుస్తోంది. సాధారణంగా ప్రమాణ స్వీకారం తర్వాత వెంటనే గవర్నర్ గెజిట్ ద్వారా శాఖలు కేటాయిస్తారు కానీ ఈసారి అధిష్టానం జోక్యం వల్ల ఆలస్యం అయినట్లు ప్రచారం ఉంది. ప్రస్తుతం సీఎం వద్ద ఉన్న పలు కీలక శాఖలను కొత్త మంత్రులకు అప్పగించే విషయంపై రేవంత్ హైకమాండ్కి తన ప్రతిపాదనలు వివరించినట్టు సమాచారం.
ఇక పాత మంత్రుల్లో కొందరు హోంశాఖను కోరుతుండగా, మున్సిపల్ శాఖపై కూడా ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. దీనివల్ల అసంతృప్తి తలెత్తకుండా సమతుల్యతను పాటించేందుకు హైకమాండ్ సమన్వయం కోసం రేవంత్ను ఢిల్లీకి పిలిపించినట్టు చెబుతున్నారు. మరోవైపు, కేబినెట్ విస్తరణలో మంత్రిపదవిపై ఆశలు పెట్టుకున్న సుదర్శన్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డి, ప్రేమ్ సాగర్ రావు, మల్ రెడ్డి రంగారెడ్డిలకు స్థానిక సంస్థల ఎన్నికల అనంతరం అవకాశం కల్పిస్తామని అధిష్టానం హామీ ఇచ్చినట్టు ప్రచారం ఉంది. మంగళవారం రేవంత్ ఖర్గేతో మరోసారి సమావేశమై తుది చర్చలు జరిపి, మంత్రుల శాఖల కేటాయింపు ప్రకటన వచ్చే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి.
More News Telugu Breaking:
Latest News Telugu Breaking:
ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి..
More Latest Telugu Breaking: External Sources
నేడు ఖర్గేతో భేటీకానున్న సీఎం రేవంత్.. కొత్తమంత్రులకు శాఖల కేటాయింపు నిర్ణయం