ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. బీజేపీని మరోసారి గెలిపించినందుకు రాహుల్ గాంధీకి అభినందనలు తెలిపిన సంగతి తెలిసిందే. కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మండిపడ్డారు.
తాము కాంగ్రెస్ పార్టీ సమరయోధులమని, తాము ఎప్పుడూ ఓటమిని అంగీకరించబోమని కోమటిరెడ్డి అన్నారు. తెలంగాణ మాదిరే తాము ఎప్పుడూ పుంజుకుంటామని చెప్పారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి 8 సీట్లు గిఫ్ట్ గా ఇచ్చి, మీ సొంత పార్టీకి సున్నా సీట్లను తెచ్చుకున్న మిమ్మల్ని అభినందిస్తున్నానని చెప్పారు. తెలంగాణలో బీజేపీ ఎదుగుదలకు ఎవరైనా కారకులైతే, అది ముమ్మాటికీ బీఆర్ఎస్ పార్టీనే అని అన్నారు.