ధాన్యం కొనుగోళ్లలో రైతులకు ఇబ్బంది కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అలాంటి వ్యాపారులపై అవసరమైతే నిత్యావసర సేవల నిర్వహణ చట్టం కింద చర్యలు తీసుకోవాలన్నది ముఖ్యమంత్రి పర్యవేక్షణ. రాష్ట్రవ్యాప్తంగా అక్కడక్కడ రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్న సంఘటనలు దృష్టికి రావటంతో స్పందించిన ముఖ్యమంత్రి వెంటనే సంబంధిత అధికారులతో మాట్లాడారు. రైతులు పండించిన పంట ఉత్పత్తుల కొనుగోళ్లలో మోసాలకు పాల్పడటం, రైతులను గందరగోళానికి గురి చేయటం, రైతులను వేధించటం లాంటి సంఘటనలపై కఠినంగా వ్యవహరించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *