కాకినాడ పోర్టు కేసులో వైసీపీ సీనియర్ నేత, రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మరోసారి నోటీసులు జారీ చేసింది. ఇప్పటికే పలుమార్లు నోటీసులు జారీ చేసిన ఆయన పలు కారణాలతో విచారణకు హాజరుకాలేదు. ఈ నేపథ్యంలో మరోసారి నోటీసులు జారీ చేసిన ఈడీ సోమవారం విచారణకు హాజరుకావాలని పేర్కొంది.
కాకినాడ సీ పోర్ట్ లిమిటెడ్, సెజ్లో కర్నాటి వెంకటేశ్వరరావు వాటాలను బలవంతంగా లాక్కున్నారనే ఆరోపణలు విజయసాయిరెడ్డిపై ఉన్నాయి. ఈ నేపథ్యంలో కేవీ రావు ఫిర్యాదును పరిశీలించిన ఈడీ విజయసాయిరెడ్డి మనీలాండరింగ్కు పాల్పడినట్లు గుర్తించింది.