ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఆప్ ఓటమి ఖరారైంది. దేశ రాజధానిలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు కానుంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా కీలక ఉత్తర్వులు జారీ చేశారు. ఢిల్లీ సెక్రటేరియట్‌ను సీజ్ చేయాలని ఆదేశించారు. ఆప్ ఓడిపోతున్న క్రమంలో, సచివాలయంలోని ముఖ్యమైన దాఖలు తరలిపోకుండా ఉండేందుకు ఆయన ఈ ఆదేశాలు జారీ చేశారు. ఆయన ఆదేశాలతో సచివాలయాన్ని జీఏడీ సీజ్ చేసింది.

గత పదేళ్లుగా ఆప్‌పై బీజేపీ అవినీతి ఆరోపణలు చేస్తోంది. ఢిల్లీలో బీజేపీ అధికారంలోకి వస్తే కాగ్ నివేదికలను అసెంబ్లీలో పెడతామని గతంలో ప్రధాని మోదీ చెప్పారు. ఇప్పుడు బీజేపీ కార్యాచరణకు సిద్ధమైంది. న్యూఢిల్లీ స్థానం నుంచి కేజ్రీవాల్, జంగ్ పురా నుంచి మనీశ్ సిసోడియా ఓటమిపాలయ్యారు. మొత్తం 70 స్థానాలకు గాను 48 స్థానాల్లో బీజేపీ ముందంజలో ఉండగా, ఆప్ 22 స్థానాల్లో లీడ్ లో ఉంది. కాంగ్రెస్ పార్టీ ఒక్క చోట కూడా ప్రభావాన్ని చూపించలేకపోయింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *