కాంగ్రెస్ పరిస్థితి గురువింద గింజ అన్నట్లుగా ఉందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను ఏడాదిలోగా అమలు చేయాలి. అసత్య ప్రచారాలతో బాధ్యతారాహిత్యంగా పని చేస్తున్నారు. అధికారంలోకి వచ్చిన రోజుల్లోనే నూటా ఆరు హామీలను నెరవేర్చిన తెలంగాణ ప్రజలకు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ లేఖ రాశారని గుర్తు చేశారు. అయితే ఇప్పుడు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కాంగ్రెస్ చతికిలపడుతోంది. వంద రోజులు పూర్తయ్యాయని, 200 రోజులు దాటిపోయాయి. ఎల్లుండితో 365 రోజులు పూర్తికానున్నాయని తెలిపారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను ఏడాది తర్వాత వాళ్లకు మరోసారి జ్ఞాపకం చేసేందుకే బీజేపీ హైదరాబాదులో సభ నిర్వహిస్తుందని వెల్లడించారు. తెలంగాణ ప్రజలను కాంగ్రెస్ ఎలా మోసం చేసిందో ప్రజలకు వివరిస్తామని చెప్పారు.
దేశ అవసరాలకు అనుగుణంగా కోల్ ప్రొడక్షన్ చేస్తున్నాం. రానున్న రోజుల్లో కోల్ ప్రొడక్షన్ పెంచి, ఇంపోర్ట్ కోల్ తగ్గించాలన్నది మా లక్ష్యం. ఈ ఏడాది 1080 మెట్రిక్ టన్నుల కోల్ ఉత్పత్తిని టార్గెట్ పెట్టుకున్నాం. పారదర్శకంగా కోల్ బ్లాక్ ల ఆక్షన్ నడుస్తుంది.” అని కేంద్ర మంత్రి వివరించారు.