ప్రజా పాలన విజయోత్సవంలో భాగంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని హైసిటీ పనులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. దాదాపు రూ. 3667 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. జీహెచ్ఎంసీ కింద రూ. 350 కోట్లతో ఫ్లై ఓవర్లు, నిర్మాణ పనులకు శంకుస్థాపన చేస్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హై సిటి ప్రాజెక్టు పేరుతో పలు అభివృద్ధి కార్యక్రమాలను తెలంగాణ ప్రభుత్వం చేపట్టింది. అన్నింటినీ కలిపి ఐమాక్స్ పక్కన హెచ్ఎండీఏ గ్రౌండ్లో వర్చువల్ గా నేటి మధ్యాహ్నం 3 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు.

అలాగే, ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా వరద నీటి సంపుల నిర్మాణానికి సీఎం రేవంత్ శ్రీకారం చుట్టనున్నారు. ఇవాళ సచివాలయం నుంచి సీఎం ప్రారంభించనున్నారు. వరద నీరు, ట్రాఫిక్ సమస్యలకు చెక్‌ పెట్టేందుకు సంపుల నిర్మాణం.. హైదరాబాద్‌ వ్యాప్తంగా 12 ప్రాంతాల్లో పనులు ప్రారంభం.. ఒక్కో సంపు సామర్థ్యం లక్ష లీటర్ల నుంచి 10 లక్షల లీటర్లు.. వరద నీటిని రోడ్ల మీద నుంచి సంపులోకి పంపి అక్కడి నుంచి పైపుల ద్వారా కాలువల్లోకి మళ్లింపు చేసేలా తెలంగాణ ప్రభుత్వం ప్లాన్ వేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *