ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తన సొంత నియోజకవర్గం కుప్పంలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఇవాళ ఆయన కుప్పం టీడీపీ కార్యాలయానికి వచ్చారు. జన నాయకుడు కేంద్రాన్ని ప్రారంభించారు. కుప్పం ప్రజలు తమ సమస్యలపై జన నాయకుడు కేంద్రంలో వినతిపత్రాలు సమర్పించవచ్చు. ఈ కేంద్రంలోని సిబ్బంది ప్రజల నుంచి వినతులు స్వీకరించి ఆన్లైన్లో నమోదు చేస్తారు.
ఆ సమస్యల తర్వాత ఆ వివరాలు ఆన్లైన్లో పరిష్కరించబడతాయి. నేడు ఈ జన నాయకుడు కేంద్రాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు పనితీరును పరిశీలించారు. ప్రస్తుతం కుప్పంలో పైలట్ ప్రాజెక్టుగా జన నాయకుడు కేంద్రం అమలు చేస్తున్నారు. దీని పనితీరు ఆధారంగా త్వరలో రాష్ట్రవ్యాప్తంగా విస్తరించనున్నారు.