ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు విజయవాడలో పర్యటించనున్నారు. ఆయన విజన్ 2047 డాక్యుమెంట్‌ను విడుదల చేయనున్న సందర్భంగా, నగరంలో ట్రాఫిక్ నియంత్రణలు అమలు చేయబడ్డాయి. ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించి పోలీసులు సకల ఏర్పాట్లు పూర్తి చేశారు.

విజయవాడలోని బెజవాడ ప్రాంతంలో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌ను మళ్లిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యంగా బందరు రోడ్డులో వాహనాల రాకపోకలపై పూర్తిస్థాయిలో ఆంక్షలు విధించారు. ఉదయం 5 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ ఆంక్షలు అమలులో ఉంటాయని పోలీసులు పేర్కొన్నారు . వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను ఉపయోగించాలని కోరారు. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం వద్ద భద్రతను పటిష్టం చేయడం జరిగింది. స్టేడియంలో జరుగనున్న బహిరంగ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రసంగించనున్నారు. ఈ సందర్భంగా ప్రజలు సూచనలు పాటించి, సహకరించాల్సిందిగా పోలీసులు విజ్ఞప్తి చేశారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *