తెలంగాణ అసెంబ్లీలో రభస సభ జరుగుతున్న సమయంలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు రచ్చ రచ్చ చేశారు. ఫార్ములా ఈ కార్ రేసింగ్ అంశంపై చర్చ జరపాలంటూ ఆందోళనకు దిగారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సీట్లపై కూర్చోకుండా ప్లకార్డులతో నిరసన తెలిపారు. స్పీకర్ చెప్పినా వినకుండా నిబంధనలకు విరుద్ధంగా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు పోడియం వైపు దూసుకెళ్లారు.
హరీశ్రావు ఆధ్వర్యంలో ఎమ్మెల్యేలు పోడియం వైపు వెళ్తుండగా మార్షల్స్ అడ్డుకున్నారు. అయినా వినకుండా బలంగా తోసుకొచ్చారు. ఈ సమయంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మార్షల్స్ మధ్య తోపులాట జరిగింది. మార్షల్స్ను తోసుకుంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పోడియం వద్దకు చేరుకుని కాగితాలను చించి గాలిలోకి విసిరారు.