తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విదేశాలకు వెళ్లేందుకు ఏసీబీ కోర్టు అనుమతించింది. ఈ నెల 13 నుంచి 23 వరకు రేవంత్ రెడ్డి ఆస్ట్రేలియా, సింగపూర్, దావోస్ వెళ్లాల్సి ఉంది. ఈ నేపథ్యంలో తన పర్యటనకు అనుమతి ఇవ్వాలని కోరుతూ ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను విచారించిన కోర్టు ఆయన పర్యటనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. కేసు నేపథ్యంలో ఆయన తన పాస్‌పోర్టును ఏసీబీ కోర్టుకు అప్పగించారు. తన విదేశీ పర్యటనల దృష్ట్యా ఆరు నెలల పాటు పాస్‌పోర్టు ఇవ్వాలని కోర్టును కోరారు. రేవంత్‌రెడ్డి అభ్యర్థనను స్వీకరించిన కోర్టు జూలై 6వ తేదీలోగా పాస్‌పోర్టును అందజేయాలని ఆదేశించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *