సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప 2: ది రూల్’ సూపర్ హిట్ టాక్‌తో రన్ అవుతోంది. డిసెంబర్ 5న విడుదలైన ఈ సినిమా మూడు రోజుల్లోనే 621 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. ఈ సినిమా విడుదలైనప్పటి నుంచి ఫిర్యాదులు అందుతున్నాయి. అదే టిక్కెట్ ధర. డిసెంబర్ 4న ప్రీమియర్ షోలతో సినిమా విడుదలైంది. ప్రీమియర్లు రూ. 1000 సింగిల్ స్క్రీన్లలో ఫైనల్ చేయడం ద్వారా నిర్మాతలు జీవనోపాధి పొందారు. ఇక మల్టీప్లెక్స్‌లో ధర మరింత పెరిగి రూ. 1200గా నిర్ణయించారు.

ఇక రిలీజ్ రోజు నుండి గడచిన ఆదివారం వరకు సింగిల్ స్క్రీన్స్ లో రూ. 300, మల్టిప్లెక్స్ లో రూ. 500 చెల్లించాల్సి వచ్చింది. దింతో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ సినిమా చూడాలి అంటే కాస్త భారంగా అనిపిస్తుంది. ఈ నేపథ్యంలో టికెట్ ధరలను ప్రభుత్వం ఇచ్చిన జీవో కంటే ఇంకా తక్కువ ఉండేలా ఫిక్స్ చేసారు మేకర్స్. డిసెంబరు 9 అనగా ఈ సోమవారం నుండి సింగిల్‌ స్క్రీన్‌లో రూ.200, మల్టీప్లెక్స్‌లో రూ.395గా ఉండేలా నిర్ణయించారు మైత్రీ నిర్మాతలు. అటు ఏపీలోను రెండవ రోజు నుండి టికెట్ ధరను తగ్గించి సింగిల్ స్క్రీన్స్ లో రూ. 220, ముల్టీప్లెక్స్ లో రూ. 300 – 400 మధ్యలో ఉండేలా ఫిక్స్ చేసారు. ఆన్ లైన్ లో బుక్ చేసుకుంటే జీఎస్టీ అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. తగ్గించిన ధరలతో సినిమా చూసే వారు పెరుగుతారు అని టీమ్ భావిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *