పునాది రాలు సినిమాతో చిరంజీవి నలుగురిలో ఒకరిగా టాలీవుడ్ కి పరిచయమయ్యారు. ఎవరి సపోర్ట్ లేకుండా స్వయం కృషితో అంచెలంచెలుగా ఎదుగుతున్న చిరంజీవి అంటే ప్రేక్షకులకు ఎంతో అభిమానం. ఎందరో యువ హీరోలకు మెగా స్టార్ రోల్ మోడల్. తన నటనతో, డ్యాన్స్తో వెండితెరపై అద్భుతాలు సృష్టించి, మరెవరూ అందుకోలేని ఎత్తులకు ఎదిగారు మెగా స్టార్.
కానీ చిరు ఇంతటి నటుడిగా మారడానికి థియేటర్లోకి అడుగు పెట్టాడు. చదువుకునే రోజుల్లోనే తొలిసారి నటించిన చిరు, ఇప్పుడు నటనను కొసగిస్తూ 50 ఏళ్లు పూర్తి చేసుకున్నాడు. నర్సాపూర్లోని వైఎన్ఎం కళాశాలలో డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదువుతున్న సమయంలో చిరు ‘రంగస్థలం మీద ‘రాజీనామా’ అనే నాటకంలో రంగస్థలంపై తొలిసారిగా నటించారు. కోన గోవిందరావు నాటకాన్ని రచించగా, చిరు ప్రధాన పాత్ర పోషించారు. ఆ నాటకంలో నటుడిగా గుర్తింపు తెచ్చుకోవడమే కాకుండా ఉత్తమ నటుడి అవార్డుకు ఎంపిక కావడం తనకు ఎనలేని ప్రోత్సాహాన్ని అందించింది. అది చిరుకు, నటుడు కావాలి అనే తన కోరిక పట్ల మరింత బలపడేలా చేసి నేడు మనందరి ముందు మెగా స్టార్ గా నిలబడేలా చేసింది. 1974 తోలి నాటకం వేసినప్పటి నుండి 2024 వరకు 50 సంవత్సరాల నట ప్రస్థానం ఎనలేని ఆనందంగా ఉందని మెగాస్టార్ చిరంజీవి ఆనాటి మధుర జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ అప్పటి ఫోటోను ఇన్స్టాగ్రామ్ వేదికగా అభిమానులతో పంచుకున్నారు.