సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో నటుడు అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్పై విచారణ వాయిదా పడింది. తనకు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేయాలని బన్నీ నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కౌంటర్ దాఖలు చేసేందుకు పోలీసులు సమయం కోరడంతో విచారణను ఈ నెల 30కి వాయిదా వేస్తున్నట్లు కోర్టు తెలిపింది.
తొక్కిసలాట ఘటనలో ఇటీవల బన్నీని పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే హైకోర్టు నాలుగు వారాల మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో ఆయన విడుదలయ్యారు. మరోవైపు ఈ నెల 13న నాంపల్లి కోర్టు విధించిన 14 రోజుల రిమాండ్ నేటితో ముగిసింది. దీంతో బన్నీ ఈరోజు వర్చువల్ గా కోర్టుకు హాజరయ్యాడు. మరోవైపు సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనపై విచారణను కూడా నాంపల్లి కోర్టు వాయిదా వేసింది. దీనిపై తదుపరి విచారణను జనవరి 10న చేపట్టనున్నట్లు వెల్లడించింది. అదే రోజు బన్నీ రిమాండ్పైనా కూడా విచారణ ఉండనుంది.