పోలీసు మాన్యువల్‌కు వ్యతిరేకంగా నిరసన తెలిపిన టీజీఎస్పీ కానిస్టేబుళ్లపై రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంది. 10 మంది వ్యక్తులు క్రమశిక్షణా రాహిత్యానికి పాల్పడ్డారని తేలింది మరియు ఆర్టికల్ 311 ప్రకారం వారి ఉద్యోగాల నుండి తొలగించబడ్డారు.పది మంది బెటాలియన్ కానిస్టేబుళ్లను విధుల నుంచి తొలగించారు. బెటాలియన్లలో అశాంతికి ఈ పది మంది కానిస్టేబుళ్లే ప్రధాన కారణమని జీపీ కార్యాలయం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. పది మంది కానిస్టేబుళ్ల వల్లే మిగతా వారంతా ఆగ్రహం వ్యక్తం చేస్తూ, కానిస్టేబుల్ ఆగడాలకు ఈ పది మంది కారణమని చెప్పారు. యూనిఫారం, క్రమశిక్షణ కలిగిన బలగాలతో ఆందోళనలు చేయడం ఆర్టికల్ 311కి విరుద్ధమని డీజీపీ ఉత్తర్వులు జారీ చేశారు. ధర్నాలు, ఆందోళనలు, న్యూస్‌ ఛానళ్లకు ఇంటర్వ్యూలు ఇవ్వడం, వాటిని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడం, పోలీసు విధుల్లో ఉండగా ఆందోళనలు రేకెత్తించడం వంటివి ఆర్టికల్‌ 311కి విరుద్ధం.

సస్పెండ్ అయిన వారు వీరే: 3వ బెటాలియన్‌ కానిస్టేబుల్‌ జి.రవికుమార్‌, 6వ బెటాలియన్‌ కానిస్టేబుల్‌ కె.భూషణ్‌రావు, 12వ బెటాలియన్‌ హెడ్‌ కానిస్టేబుల్‌ రామకృష్ణ, కానిస్టేబుల్‌ ఎస్‌కే షరీఫ్‌, 17వ బెటాలియన్‌ ఏఆర్‌ఎస్సై సాయిరామ్, కానిస్టేబుళ్లు కె.లక్ష్మీనారాయణ, ఎస్‌.కరుణాకర్‌రెడ్డి, టి.వంశీ, బండెల అశోక్, ఆర్‌.శ్రీనివాస్‌లను విధుల్లోంచి తొలగిస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *