ఈ నెల 4న రాత్రి ఆర్టీసీ క్రాస్ రోడ్స్లోని సంధ్య థియేటర్లో పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందిన విషయం తెలిసిందే. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు నటుడు అల్లు అర్జున్తో పాటు సంధ్య థియేటర్ యజమానిపై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో గాయపడిన శ్రీతేజ్ ఐసీయూలో వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్నాడు. ఇక శ్రీతేజ్ వైటల్స్ అన్నీ కొద్దిగా నిలకడగా ఉన్నాయని అంటున్నారు వైద్యులు. ఆహారాన్ని తీసుకోగలుగుతున్నాడు అని, అప్పుడప్పుడు ఫీవర్ ఉంటోంది అని తెలుస్తోంది. పూర్తిగా స్పృహలో అయితే లేడు, అప్పుడప్పుడు ఫిట్స్ లాంటి కదలికలు ఉన్నాయని, ప్రత్యేకంగా శ్రీతేజ్ ను వైద్యులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారని తెలుస్తోంది.