చైనాలో ప్రకంపనలు సృష్టిస్తున్న హ్యూమన్ మెటాన్యుమో వైరస్ మన దేశంలోనూ విస్తరిస్తుంది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో తొలి కేసులు నమోదు కాగా తాజాగా మరో రెండు కేసులు నమోదయ్యాయి. అయితే మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో ఇద్దరు చిన్నారులకు హెచ్‌ఎంపీవీ వైరస్ సోకింది. 7, 14 ఏళ్ల బాలికలిద్దరూ దగ్గు, జ్వరంతో బాధపడుతున్నట్లు వైద్యులు గుర్తించారు. భారతదేశంలో ఇప్పటివరకు 7 HMPV కేసులు నమోదయ్యాయి. కర్ణాటక, తమిళనాడు, గుజరాత్‌లలో సోమవారం తొలి కేసులు నమోదయ్యాయి. అయితే ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా కూడా చెప్పారు.

ఇక, హెచ్‌ఎంపీవీ కొత్త వైరస్‌ కాదని ఇప్పటికే కేంద్ర ఆరోగ్య రంగ నిపుణులు తెలియజేస్తున్నారు. ఈ వైరస్‌ చాలా ఏళ్లుగా వ్యాప్తిలో ఉందంటున్నారు. గాలి, శ్వాసప్రక్రియ ద్వారా ఇది సోకుతుందన్నారు. అన్ని వయసుల వారిని ఈ వైరస్ ప్రభావితం చేస్తోందని తెలిపారు. ఆరోగ్యమంత్రిత్వ శాఖ, ఐసీఎంఆర్‌, ఎన్సీడీసీ చైనాతో పాటు పొరుగు దేశాల్లో పరిస్థితిని గమనిస్తున్నాయి. దేశంలోని పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనిస్తూ, ఆరోగ్యపరమైన సవాళ్లపై తక్షణం ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *