ప్రముఖ నటి నయనతార, ఆమె భర్త విఘ్నేశ్ శివన్, మరియు నెట్ఫ్లిక్స్ కు మద్రాస్ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ‘నయనతార: బియాండ్ ది ఫెయిరీ టేల్’ డాక్యుమెంటరీలో అనుమతి లేకుండా ‘నానుమ్ రౌడీ దాన్’ ఫుటేజీ వాడుకపై కోలీవుడ్ నటుడు ధనుష్ కోర్టును ఆశ్రయించారు.
మూడు సెకన్ల క్లిప్ కారణంగా ధనుష్ ₹10 కోట్లు నష్ట పరిహారం డిమాండ్ చేశారు. ఈ క్రమంలో నయనతార తనపై ద్వేషం చూపుతున్నారంటూ ధనుష్ పై విమర్శించారు. ఈ నేపథ్యంలో, జనవరి 8లోపు సమాధానం ఇవ్వాలని మద్రాస్ హైకోర్టు నోటీసులు జారీ చేసింది.