హైదరాబాద్‌లో కనిష్ట స్థాయిలు రికార్డు స్థాయికి పడిపోయాయి. నగరంలో సింగిల్ డిజిట్‌కే పరిమితం. కొన్ని ప్రాంతాల్లో కనిష్టంగా 7.1 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. రానున్న రోజుల్లో చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ముఖ్యంగా ఆదిలాబాద్, ఆసిఫాబాద్ జిల్లాల్లో చలి తీవ్రత పెరుగుతుందని చెబుతున్నారు. ఈ మేరకు హెచ్చరికలు జారీ చేశారు. ముఖ్యంగా తెలంగాణలో మరికొన్ని రోజులు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.

మౌలాలి, హెచ్‌సీయూ ప్రాంతాల్లో అత్యల్ప ఉష్ణోగ్రతలు 7.1 డిగ్రీలు, బీహెచ్‌ఈఎల్ 7.4, రాజేంద్రనగర్ 8.2 డిగ్రీలు, గచ్చిబౌలి 9.3, వెస్ట్ మారేడ్‌పల్లి 9.9, కుత్బుల్లాపూర్ 10.2, మచ్చబొల్లారం 10.2, శివరాంపల్లి 10.3, బాలానగర్ 1.1.4.5, షాపూర్ నగర్ 11.7, లింగంపల్లి 11.8, బోయిన్‌పల్లి 11.9, బేగంపేట్ 12, ఆసిఫ్‌నగర్ 12, నేరేడ్‌మెట్ 12.1, లంగర్ హౌస్ 12.2, మోండా మార్కెట్ 12.4, చందానగర్ 12.7, షేక్‌పేట, 2.82, మాదాపూర్, 2.81, మాదాపూర్, 12. చాంద్రాయణగుట్ట 13, కూకట్ పల్లి 13.1, గోల్కొండ 13.2, సఫిల్ గూడ 13.3, హయత్ నగర్ 13.3, ఉప్పల్ 13.4, మల్లాపూర్ 13.5, ఆదర్శనగర్ 13.5 డిగ్రీల సెల్సియస్ నమోదైంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *