Breaking News Telugu

News5am, Latest Breaking Telugu (24-05-2025): తెలంగాణలో మొదటి కరోనా పాజిటివ్‌ కేసు నమోదైంది. కూకట్‌పల్లి ప్రైవేట్ ఆసుపత్రిలో పని చేసే వైద్యుడికి జలుబు, దగ్గు, జ్వర లక్షణాలు కనిపించడంతో RTPCR పరీక్ష నిర్వహించగా కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమై గాంధీ ఆసుపత్రిలో 25 పడకల ప్రత్యేక వార్డును సిద్ధం చేసింది. వాతావరణ మార్పుల వల్ల కొందరికి కరోనా లక్షణాలు కనిపిస్తున్నాయని వైద్యులు చెబుతున్నారు. ఎవరికైనా ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే పరీక్షలు చేయించుకోవాలని సూచిస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో విశాఖపట్నంలో ఓ మహిళకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కాగా, కడప రిమ్స్‌లో 70 ఏళ్ల మహిళను ముందు జాగ్రత్తగా కోవిడ్ వార్డులో చేరదీసినట్టు తెలిపారు. అయితే, ఆమెకు టెస్ట్ చేయలేదని, కిట్స్‌ లేనందున నిర్ధారణ కాలేదని అధికారులు చెప్పారు. రాష్ట్రంలో ఇప్పటివరకు ఒక్క పాజిటివ్‌ కేసు మాత్రమే నమోదు అయ్యిందని ఆరోగ్య మంత్రి ప్రకటించారు. ప్రజలు ఆందోళన చెందకూడదని, ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రస్తుతం కనిపిస్తున్న కరోనా వేరియంట్ తీవ్రత తక్కువగా ఉండడంతో, వృద్ధులు, గర్భవతులు, మరియు టీకాలు వేయించుకోని వారు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.

More Latest General Telugu News:

Latest Breaking Telugu:

మైక్రోసాఫ్ట్ ‘అరోరా’: ఒక సరికొత్త ఏఐ మోడల్

బీటెక్ టు నక్సలిజం..

More Latest Breaking Telugu: External Sources

తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న కరోనా కేసులు..జాగ్రత్తలు పాటించండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *