ఏపీ ప్రజలకు రైల్వేశాఖ తీపి కబురు చెప్పింది. ప్రయాణికుల రద్దీ దృష్టిలో ఉంచుకుని, మహా కుంభమేళాకు విజయవాడ మీదుగా ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు విజయవాడ రైల్వే అధికారులు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. జనవరి 18, ఫిబ్రవరి 8, 15, 23 తేదీల్లో తిరుపతి-బెనారస్‌ (07107) ప్రత్యేక రైలు నడవనున్నట్లు పేర్కొన్నారు. తిరుపతి-బెనారస్‌ (07107) ప్రత్యేక రైలు జనవరి 18, ఫిబ్రవరి 8, 15, 23 తేదీల్లో శనివారం రాత్రి 8.55 గంటలకు తిరుపతిలో బయలుదేరి, సోమవారం మధ్యాహ్నం 3.45 గంటలకు బెనారస్‌ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో 07108 నంబరు రైలు జనవరి 20, ఫిబ్రవరి 10, 17, 24 తేదీల్లో బెనారస్‌లో మంగళవారం సాయంత్రం 5.30 గంటలకు బయలుదేరుతుంది.

మహా కుంభమేళాకు ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని ప్రయాగ్‌రాజ్‌ సిద్ధమవుతోంది. 2025 జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు, 45 రోజుల పాటు మహా కుంభమేళా జరగనుంది. ఈ ఉత్సవానికి ప్రపంచవ్యాప్తంగా దాదాపు 40 కోట్ల మంది వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. భద్రత కోసం పారామిలిటరీ బలగాలు సహా 50 వేల మంది సిబ్బంది మోహరించనున్నారు. కుంభమేళా సమాచారం తెలుసుకునేందుకు 11 భారతీయ భాషల్లో ఏఐ చాట్‌బాట్ అందుబాటులో ఉంటుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *