జమ్మూకశ్మీర్‌లో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇంట్లో నిద్రిస్తున్న ఆరుగురు సజీవ దహనమయ్యారు. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే వివరాల ప్రకారం ఈరోజు తెల్లవారుజామున కథువలోని ఓ ఇంట్లో మంటలు చెలరేగాయి. అయితే ఇంట్లో నిద్రిస్తున్న ఆరుగురు మంటల్లో చిక్కుకుని సజీవ దహనమయ్యారు. ఈ ప్రమాదంలో మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి వారిని స్థానిక ఆసుపత్రిలో చేర్పించారు. వీరి పరిస్థితి మరింత విషమంగా ఉన్నట్లు సమాచారం.

అయితే, మంటలు చెలరేగాయన్న స‌మాచారంతో హుటాహుటిన సంఘ‌ట‌న ప్రాంతానికి ఆగ్నిమాపక సిబ్బంది, పోలీసులు చేరుకున్నారు. బాధితుల‌ను ఆసుప‌త్రుల‌కు త‌ర‌లించారు. మృతి చెందిన వారి మృతదేహాలను పోస్టు మార్టం కోసం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘ‌ట‌న‌పై అన్ని కోణాల్లో పోలీసులు విచారణ చేస్తున్నారు. పోస్టుమార్టం తర్వాత మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగిస్తామ‌ని పోలీసులు వెల్లడించారు. అగ్ని ప్రమాదానికి షార్ట్ స‌ర్క్యూటే కార‌ణమై ఉంటుంద‌ని పోలీసుల ప్రాథమిక స‌మాచారంలో తేలింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *