హైదరాబాద్‌లోని ఓ రియల్ ఎస్టేట్ సంస్థలో ఆదాయపు పన్ను శాఖ అధికారులు సోదాలు చేపట్టారు. సోమవారం ఉదయం నగరంలోని మూడు చోట్ల ఏకకాలంలో దాడులు నిర్వహించారు. ఇటీవల జరిగిన విలువైన భూమి అమ్మకానికి సంబంధించిన సొమ్మును లెక్కల్లో చూపకపోవడంతో అధికారులు ప్రస్తుతం సోదాలు చేపట్టినట్లు తెలుస్తోంది. నగరంలోని ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీ స్వస్తిక్ గ్రూప్ కార్యాలయంలో అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు.

షాద్ నగర్ ప్రాంతంలో రూ.300 కోట్ల విలువైన భూమిని మల్టీ నేషనల్ కంపెనీకి విక్రయించింది. అయితే, ఈ లావాదేవీకి సంబంధించిన డబ్బును స్వస్తిక్ గ్రూప్ తన బ్యాలెన్స్ షీట్‌లో చూపించలేదు. ఈ ఆరోపణల నేపథ్యంలో ఐటీ అధికారులు తాజాగా స్వస్తిక్ గ్రూప్ యజమానులు కల్పన రాజేంద్ర, లక్ష్మణ్ ల నివాసాలతో పాటు షాద్ నగర్, చేవెళ్ల, బంజారాహిల్స్ లోని ఇళ్లు, ఆఫీసులలో తనిఖీలు నిర్వహిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *