తెలంగాణలో మళ్లీ ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. దీంతో చలి తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. రాష్ట్రంలోనే అత్యల్పంగా ఉమ్మడి జిల్లాలో నమోదయ్యాయి. హైదరాబాద్‌తో పాటు అన్ని జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి. గత వారం రోజులుగా ఉష్ణోగ్రతలు సాధారణం కంటే తక్కువగా నమోదవుతున్నాయన్న వాతావరణ శాఖ ప్రకటనకు ఇది ప్రత్యక్ష నిదర్శనం. ముఖ్యంగా తెల్లవారుజామున పొగ మంచును కప్పేస్తుంది. అయితే గత 2 రోజులుగా మళ్లీ చలి పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. రానున్న రోజుల్లో మరింత తీవ్రతరం కానున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

తెలంగాణలోని ఉమ్మడి జిల్లాపై చలి పంజా విసురుతుంది. ఉమ్మడి జిల్లాలో చలి తీవ్రత మళ్ళీ పెరిగింది. కనిష్ట ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్‌కు పడిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. హైదరాబాద్‌తో పాటు ఆదిలాబాద్, మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లా, కొమురం భీం, నిర్మల్‌, మంచిర్యాల జిల్లాలో సింగిల్ డిజిట్‌కు ఉష్ణోగ్రతలు పడిపోయాయి. చలి తీవ్రతతో స్థానికులు చలి మంటలు వేసుకుంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *