ప్రైవేట్ ఆసుపత్రుల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. డబ్బు కోసం డాక్టర్లు ప్రజల ఆరోగ్యంతో ఆడుకుంటున్నారు. ఐదేళ్ల చిన్నారి కంట్లో నలుసు పడిందని ఆస్పత్రికి వెళ్తే ఆపరేషన్ నిర్లక్ష్యం కారణంగా మృతి చెందింది. హైదరాబాద్ హబ్సిగూడలోని ఆనంద్ ఐ ఇన్‌స్కాడ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈ దారుణానికి ఒడిగట్టాడు. అన్విక (5)కి కంటిలో నలక పడిందని ఆమె తల్లిదండ్రులు శుక్రవారం (నవంబర్ 22) ఆనంద్ కంటి ఆసుపత్రికి వచ్చారు.

కంటిలో నలక తీసేయాలంటే సర్జరీ చేయాలని డాక్టర్లు సూచించారు. శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు అన్విక సర్జరీ చేసేముందు మత్తు ఇంజక్షన్ ఇచ్చారు. మత్తు ఇంజక్షన్ ఇచ్చిన కొద్దిసేపటికే పాప హార్ట్ బీట్ ఆగిపోయింది. హార్ట్ బీట్ ఆగిపోవడంతో ఐ హాస్పిటల్ డాక్టర్లు అప్పటికప్పుడు తల్లిదండ్రులకు తెలియకుండా అన్వికను ఎల్బీనగర్ రెయిన్ బో హాస్పిటల్ కు తరలించారు. రెయిన్ బో హాస్పిటల్ వైద్యులు పాప స్పృహలో లేదని నిర్ధారించారు. కంట్లో నలక పడిందని వస్తే సర్జరీ చేయాలని చెప్పి ఇప్పుడు పాప మృతదేహాన్ని అప్పగిస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. హన్విక మృతదేహాన్ని తీసుకుని ఆనంద్ ఐ ఇన్స్టిట్యూట్ వద్దకు వెళ్లి ఆందోళన చేపట్టారు. ఈ ఘటనపై పోలీసులకు సమాచారం అందడంతో ఆనంద్ ఐ ఇన్స్టిట్యూట్ వద్దకు చేరుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *