హైదరాబాద్లో మెట్రో రైలు రెండో దశ భూసేకరణకు మరో అడుగు పడింది. ఎంజీబీఎస్ నుంచి చాంద్రాయణ గుట్ట వరకు 7.5 కిలోమీటర్ల మెట్రో మార్గానికి అవసరమైన భూసేకరణ ప్రకటనకు కలెక్టర్ ఆమోదం తెలిపారు. దీంతో ఓల్డ్ సిటీ మెట్రో రైలు భూసేకరణ పనులు ప్రారంభం కానున్నాయి. ఈ మార్గంలో రోడ్ల విస్తరణ, స్టేషన్ల నిర్మాణానికి భూములు సేకరించనున్నారు. హైదరాబాద్ మెట్రో రైలు కార్పొరేషన్ ఇప్పటికే భూసేకరణకు నోటీసులు ఇచ్చింది.
సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు మెట్రో ఫేస్ 2 కారిడార్ VI..MGBS నుంచి చాంద్రాయణగుట్ట వరకు దాదాపు 200 పైగా ఆస్తులకు డిక్లరేషన్ ఇచ్చింది. శనివారం ఆస్తుల సేకరణ డిక్లరేషన్ కు జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిషెట్టి ఆమోదం తెలిపారు. ఆస్తుల సేకరణ పూర్తయితే డిసెంబర్ లో అవార్డు ఆమోదం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. 2025 జనవరిలో మెట్రో రైలు పనులు ప్రారంభమవుతాయని కలెక్టర్ తెలిపారు.