ఆంధ్రప్రదేశ్‌ గ్రూప్‌ 1 మెయిన్స్‌ పరీక్షలు వాయిదా వేస్తున్నట్లు ఏపీపీఎస్‌సీ ప్రకటించింది. తొలుత నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం సెప్టెంబర్ 2 నుండి 9వరకు (7వ తేదీ మినహా) పరీక్షలు జరగాల్సి ఉంది.పరీక్ష సమీపిస్తున్న తరుణంలో అభ్యర్థులు ఆందోళనలు ఎక్కువయ్యాయి. అయితే అభ్యర్ధుల నుండి వచ్చిన విజ్ఞప్తుల మేరకు పరీక్షలు వాయిదా వేయాలని నిర్ణయం తీసుకున్నట్లు ఏపీపీఎస్‌సీ తెలిపింది. పరీక్ష నిర్వహించేందుకు కొత్త తేదీలు త్వరలోనే ప్రకటిస్తామని పేర్కొన్నారు.

ఏపీలో మొత్తం 81 గ్రూపు 1 పోస్టుల భర్తీకి గానూ మార్చి 17న ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించడం జరిగింది. ఈ పరీక్షలకు మొత్తం 1,48,881 మంది దరఖాస్తులు చేసుకున్నారు. అందులో 4,496 మంది మెయిన్స్ కు అర్హత సాధించారు. అయితే గ్రూప్-2 తరహాలో గ్రూప్-1 మెయిన్స్ కు 1:100 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేయాలన్న డిమాండ్ వినిపిస్తోంది. అయితే, ఈ అంశంపై త్వరలో అధికారికంగా స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *