గత కొన్ని వారాలుగా నిరసనలతో అట్టుడుకుతున్న బంగ్లాదేశ్‌లో కొత్త తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది. విద్యార్థి సంఘాల కోరిక మేరకు నోబెల్ గ్రహీత మహ్మద్ యూనస్ బంగ్లాదేశ్ పాలనా చేపట్టారు. ఈ సందర్భంగా మహ్మద్ యూనస్ మాట్లాడుతూ బంగ్లాదేశ్ ప్రజలకు భద్రత కల్పిస్తుందన్నారు. విద్యార్థుల పోరాటంతోనే బంగ్లాదేశ్‌కు మరోసారి స్వాతంత్య్రం వచ్చిందన్నారు. వచ్చిన స్వేచ్ఛను జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని యూనస్ స్పష్టం చేశారు.

దేశం యొక్క పునర్నిర్మాణం మరియు బంగ్లాదేశ్‌లో శాంతియుత పరిస్థితుల కోసం విద్యార్థులు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ముందుగా బంగ్లాదేశ్‌లో శాంతియుత వాతావరణం నెలకొనాలని, దేశంలో ఎక్కడా ఎవరిపై దాడులు జరగకుండా ప్రజలంతా కష్టపడి కృషి చేయాలి. దయచేసి ఎక్కువ మంది శత్రువులను సృష్టించవద్దని యూనస్ అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *