2024 నేటితో ముగుస్తుంది. రేపు కొత్త సంవత్సరం ప్రారంభమవుతోంది. ఈ ఏడాది చివరి రోజు దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో కొనసాగుతున్నాయి. ఈ ఉదయం ట్రేడింగ్ నష్టాలతో ప్రారంభమైంది. బలహీన అంతర్జాతీయ సంకేతాల కారణంగా సూచీలు ఒత్తిడిలో ఉన్నాయి. అర్ధరాత్రి 1.28 గంటలకు సెన్సెక్స్ 413 పాయింట్లు క్షీణించి 77,809 పాయింట్లకు చేరుకుంది. నిఫ్టీ 117 పాయింట్లు నష్టపోయి 23,521 వద్ద ట్రేడవుతోంది.

బీఎస్ఈ సెన్సెక్స్ లో టెక్ మహీంద్రా, టీసీఎస్, ఇన్ఫోసిస్, జొమాటో, హెచ్సీఎల్ టెక్నాలజీస్, భారతి ఎయిర్ టెల్, బజాజ్ ఫైనాన్స్, ఇండస్ ఇండ్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, అదానీ పోర్ట్స్, బజాజ్ ఫిన్ సర్వ్ తదితర కంపెనీలు టాప్ లూజర్లుగా ఉన్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *